ఈ ఘటనపై సీఎం కేసీఆర్ చాలా బాధపడ్డారు- కేటీఆర్‌

218
KTR
- Advertisement -

నల్గొండ జిల్లా హజీపూర్ గ్రామంలో జరిగిన దారుణ ఘటనపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన శ్రీనివాసరావును శిక్షించాలని డిమాండ్ చేస్తూ హాజీపూర్‌లో బాధిత కుటుంబాలు దీక్ష చేపట్టాయి. ఇందుకు సంబంధించిన ఫొటోను మల్యాల గ్రామ సర్పంచ్ బిట్టు శ్రీనివాస్‌ కేటీఆర్‌ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

శ్రీనివాస్ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్ ఆయనకు ఫోన్ చేశారు. హాజీపూర్ హత్యోదంతాలపై సీఎం కేసీఆర్ చాలా బాధపడ్డారని చెప్పుకొచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్న కేటీఆర్.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. అయితే లోక్‌సభ ఎన్నికల హడావిడి ముగిశాక.. హాజీపూర్‌కు వస్తానని సర్పంచ్‌కు తెలిపారు. తాను ఫోన్‌ చేసి మాట్లాడిన విషయాన్ని బాధితులకు, గ్రామస్తులకు తెలియజేయాలని సర్పంచ్‌ బిట్టు శ్రీనివాస్‌కు కేటీఆర్‌ సూచించారు.

- Advertisement -