ఆడోళ్లు…భలే కఠినాత్ములు

307
Krishnarjuna Yuddham Teaser
- Advertisement -

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కృష్ణార్జున యుద్ధం టీజర్‌ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. యాడున్నార్రా గోపికలు..అంటూ మొదలయ్యే టీజర్‌లో అవతలి వాళ్లను మనం ఎంత కొరుకుంటున్నామో మన కళ్లల్లో వాళ్లకు కనబడాలి.ఆడోళ్లు భలే కఠినాత్ములు..రామాయణం అంతా విని రాముడికి ధర్మరాజు ఏమవుతాడు అన్నట్లు ఉందని చెప్పే నాని వేరియేషన్ డైలాగ్‌లు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేయనుండగా అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. నాని సరసన రుక్సర్‌ మీర్‌, అనుపమా పరమేశ్వరన్‌ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆ టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.

https://youtu.be/pdfyHCkKa_8

- Advertisement -