పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న నవీన్ చంద్ర..

250
- Advertisement -

హీరోగా తనదైన ముద్రను వేసిన నవీన్ చంద్ర కొత్త చిత్రం ప్రారంభం అయ్యింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందబోతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సంస్థ కార్యాలయంలో జరిగింది. దర్శకుడు సుధీర్ వర్మ క్లాప్ ఇవ్వగా, మరో దర్శకుడు కృష్ణ చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గౌరవ దర్శకత్వం దర్శకుడు అనీల్ కృష్ణ వహించారు.

Hero Naveen Chandra

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ : దర్శకుడు వేణు మదుకంటి వెంకటాపురంకి దర్శకుడుగా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మంచి స్క్రిప్ట్ కోసం టైం తీసుకున్నాం. నిర్మాత మంజునాథ్‌తో కలసి సంవత్సరం నుండి ఈ కథ పై పనిచేశాము. ఇప్పటి వరకూ పొలిటికల్ బ్యాక్డ్రాప్‌లో రానీ కథ, కథనాలతో ఈ సినిమా ఉండబోతుంది. నిర్మాత మంజునాథ్ మంచి సినిమాతో తెలుగు పరిశ్రమలోకి రబోతున్నారనే నమ్మకం మాకుంది. వైజాగ్ నేపథ్యంలో జరిగే ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో చివరి నిముషం వరకూ ప్రేక్షకుల ఊహకందని మలుపులుంటాయి. ఈ స్క్రీన్ ప్లై బేస్డ్ మూవీ రెలాస్ట్రిక్ ఇన్సిడెంట్స్ లేవు. చివరి వరకూ ఎవరూ ఊహించని మలుపు లతో కథ నడుస్తుంది. లవ్, ఎంటర్ టైన్మెంట్స్ లో ఇప్పటి వరకూ చూసిన నవీన్ చంద్రను కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాను నవీన్ చంద్ర ఇప్పటి వరకూ చేయని రోల్‌లో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాడు. జూన్ మొదటి వారంలో రెగ్యులర్ షూట్ ప్రారంభం అవుతుంది.

Hero Naveen Chandra

నిర్మాత మంజునాథ్ : యశాస్ సినిమాస్ బ్యానర్ లో కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ని ప్లాన్ చేస్తున్నాం. వేణు ఐడియా నచ్చి కథ పై వర్క్ చేసాం. తప్పకుండా ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది.

హీరో నవీన్ చంద్ర : నా కెరియర్ లో బాల్ రెడ్డి పాత్ర పెద్ద మలుపు గా అనుకోవచ్చు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత చాలా మంచి పాత్రలు చేస్తున్నా. త్రివిక్రమ్ గారికి, ఎన్టీఆర్ గారి చాలా థాంక్స్ చెప్పుకోవాలి. ఈ కథ కూడా అన్ని రకాల ప్రేక్షకులకు ఒక విభిన్న మయిన సినిమా ఇవ్వ బోతున్నాము. కొన్ని సినిమాలు చేస్తున్నా, కథ ను నమ్మే ప్రొడ్యూసర్ దొరకడం మా అదృష్టం. ఈ బ్యానర్ కొత్త టాలెంట్ ని ప్రోత్సహించేందుకు ముందు ఉంటుంది. మరో వంద సినిమాలు ఈ బ్యానర్ నుండి రావాలని కోరుకుంటున్నాను. మీడియా సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి.

- Advertisement -