నేడు రామగుండంకు సీఎం కేసీఆర్..

521
kcr ramagundam
- Advertisement -

సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్,కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. శనివారం రామగుండంలో నిర్మాణంలో ఉన్న ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్‌ను పరిశీలించడంతో పాటు ఎన్టీపీసీ,జెన్‌కో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

అనంతరం రాత్రి కరీనంగర్‌లో బస చేసి ఆదివారం ఉదయం కాళేశ్వరం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజ్ పనులు పరిశీలిస్తారు.

సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు అధికారులు. ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన రెండు హెలీపాడ్‌లతోపాటు ప్లాంట్ నిర్మాణ పనులు, ముఖ్యమంత్రి బస చేసే జ్యోతిభవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు.

రామగుండం ఎన్టీపీసీలో 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తుండగా, తొలి విడుతలో చేపట్టిన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పనులు శరవేగం గా జరుగుతున్నాయి. రూ.10,598.98 కోట్ల వ్యయంతో రామగుండం ఎన్టీపీసీలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను 2016 ఆగస్టులో ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ పవర్ స్టేషన్ కోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రెండు టీఎంసీల నీటిని కేటాయించారు. దీనికి ఒడిశాలోని మందాకిని-బీ మైన్ నుంచి బొగ్గు సరఫరా చేస్తారు.

- Advertisement -