50 రూపాయల కోసం మంత్రి భార్య ఏం చేసిందో చూడండి..!

246
- Advertisement -

యాభై రూపాయల టోల్ ఫీజు కట్టకుండా అరగంటసేపు టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ కి కారణమయ్యారు మంత్రి భార్య.. మంత్రి ప్రత్రిపాటి పుల్లారావు భార్యకు, మాడ్గులపల్లి టోల్ ప్లాజా సిబ్బందికి మధ్య జరిగిన వివాదం ఇది. అద్దంకి –నార్కట్పల్లి జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో ఉన్న టోల్ ప్లాజా వద్ద మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య, కుటుంబ సభ్యులు శుక్రవారం సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు.

Minister Wife Halchal Tool Plaza

మంత్రి భార్య తన కారులో హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్నారు. టోల్ రుసుము చెల్లించాలని సిబ్బంది ఆమె కారును ఆపారు. దాంతో ఆమె ‘నేను మంత్రి భార్యను. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది’అని చెప్పారు. కానీ స్టిక్కర్ అనుమతి కాలపరిమితి దాటిందని, టోల్ రుసుము చెల్లించకుంటే కారు వేళ్లేది లేదని టోల్ ప్లాజా సిబ్బంది తేల్చి చేప్పారు.

స్టిక్కర్ గడువు ముగియడం, కారులో ఎమ్మెల్యే లేకపోవడంతో టోల్ ప్లాజా సిబ్బంది ఆర్అండ్బీ రూల్స్ ప్రకారం టోల్ రుసుము చెల్లించాలని చెప్పారు. మంత్రి భార్య, కుటుంబ సభ్యులు అరగంట సేపు టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చివరికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పీఏ ఫోన్ చేసి చెప్పినా వారు అనుమతి ఇవ్వకపోవడంతో టోల్ రుసుము చెల్లించి వెళ్లారు. మంత్రి భార్య నిర్వాకంతో టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామైంది.

- Advertisement -