కాంగ్రెస్‌కు షాక్..బీజేపీలోకి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి

768
ponguleti sudakar reddy
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్న పొంగులేటి బీజేపీ కండువా కప్పుకొనున్నారు.

కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన పొంగులేటి రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ పంపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి తెలంగాణ కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేశారు. కాంగ్రెస్‌ సీనియర్ నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. ఖమ్మం ఎంపీ టికెట్ ఆశీంచిన ఆయన చివరి వరకు తనకు వస్తుందనే నమ్మకంతోనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాజీ ఎంపీ రేణుకా చౌదరికి టికెట్ ఇవ్వడంతో బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం పొంగులేటి టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. చివరకు పొంగులేటి కమలం వైపు మొగ్గుచూపారు.

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణాలో ఘోర ఓటమికి రాష్ట్ర నాయకత్వమే నైతిక బాధ్యత వహించాలని బహిరంగంగా వ్యాఖ్యాలు కూడా చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరగా తాజాగా పొంగులేటి కూడా అదేబాటులో నడుస్తుండటంతో ఆ పార్టీకి పెద్ద షాకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -